కుంకుమ గౌరీ నోము కథ | kumkuma gowri nomu katha| kartheeka maasam puja

కుంకుమ గౌరీ నోము కథ 



ఒక బ్రాహ్మణునకు లేకలేక ఒక కూతురు కలిగెను.అతడు ఆమె జాతకము చూడగా , అందులో ఆమె బాల వితంతువు అగునని ఉన్నది. అందుచే అతడు ఆమెకు వివాహం చేయకుండా ఆమెను తీసుకొని కాశీకి వెళ్లి పార్వతి దేవిని ప్రార్ధించెను. అంతటా దయామయియగు పార్వతీదేవి ప్రత్యక్షమై, మీకేమి కావలెను ? అని అడుగగా, అతడు తన కుమార్తెకు వైధవ్యము ప్రాప్తించకుండు అట్లు చేయమని ప్రార్ధించెను. అప్పుడు పార్వతీదేవి, ఓయి బ్రాహ్మణోత్తమా !
నీ కుమార్తె పూర్వ జన్మమున కుంకుమ గౌరీ నోము నోచి ఉల్లంగించుటచే ఈ జన్మలో బాల వైధవ్యం ప్రాప్తించుచున్నది. ఇప్పుడు ఆమె చేత ఆ నోము చేయించునచో ఆ కష్టము సంభవింపదని చెప్పగా , అమ్మకు భక్తితో నమస్కరించి కూతురితో ఆ నోము చేయించి తరువాత ఆమెకు వివాహం చేసెను.  ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతియై సుఖముగా ఉన్నది. 
ఈ నోము ఒక సంవత్సరం పాటు కార్తీకం లేదా మాఘమాసంలో మొదలుపెట్టి రోజు ఉదయం దీపారాధన చేయగానే , అక్షింతలు చేత పట్టుకొని ఈ  కథ చదువుకొని , కథ చదువుకోవడం పూర్తి కాగానే కొన్ని అక్షింతలను గౌరీ దేవి పటమునకు వేసి, కొన్ని అక్షింతలు వ్రతం చేసుకునే వారి తలపై వేసుకోవలెను. ఇలా సంవత్సరంపాటు చేసిన తరువాత ఉద్యాపన చేసుకోవాలి. 
ఉద్యాపన : 13 కుంకుమభరిణెలు నిండా కుంకుమ పోసి నల్లపూసలు దక్షిణతాంబులం పెట్టి 13  ముత్తయిదులకు తాంబూలం ఇవ్వాలి. 

Kumkuma gowri nomu katha

Comments

Popular posts from this blog

అనుభవాలు, purnodayam blogspot

ఈర్షా ద్వేషాలు telugu quotes purnodayam.blogspot.com

సుఖ దుఃఖాలు || Purnodayam || quotes || Purnodayam.blogspot.com

సంక్రాంతి పండుగ

దంపతి తాంబూల నోము | dampati thambula nomu | dampathi pooja | dampathi pooja procedure