జంధ్యాల పూర్ణిమ jandyala purnima | sravana purnima
జంధ్యాల పూర్ణిమ, దీనినే శ్రావణ పూర్ణిమ అని కూడా అంటారు. శ్రావణ పూర్ణిమ నాడు యజ్ఞోపవీతం ధారణ చేస్తారు. యజ్ఞోపవీతం లోని గ్రంధిని బ్రహ్మ ముడి అంటారు. ఈ ముడి చివరన, గాయత్రీ ఉంటుంది. జంధ్యము, బ్రహ్మ తేజస్సు, వర్చస్సు, ఆయుష్షు, యశస్సు అనుగ్రహిస్తుంది. శ్రావణ పూర్ణిమ రోజున అశౌచ సందర్భాలలో నూతన యజ్ఞోపవీతం ధరించాలి. జీర్ణమైన యజ్ఞోపవీతాన్ని ఎక్కువ కాలం ధరించరాదు. కొత్త జంధ్యం వేసుకున్న తరువాత పాత జంద్యముతో కలిసి పట్టుకొని గాయత్రీ మంత్రాన్ని జపించాలి.
తత్ద్వారా నూతన యజ్ఞోపవీతం శక్తి వంతం అవుతుంది.
ఆ తరువాత పాత యజ్ఞోపవీతం ఎవరు తొక్కని చోట కానీ, పారేనీటిలో కానీ వేయాలి. శ్రావణ పూర్ణిమ నాడు జంధ్యం మార్చుకొని, యధా శక్తి గాయత్రీ మంత్రం జపించాలి.
Comments
Post a Comment