కుంకుమ గౌరీ నోము కథ ఒక బ్రాహ్మణునకు లేకలేక ఒక కూతురు కలిగెను.అతడు ఆమె జాతకము చూడగా , అందులో ఆమె బాల వితంతువు అగునని ఉన్నది. అందుచే అతడు ఆమెకు వివాహం చేయకుండా ఆమెను తీసుకొని కాశీకి వెళ్లి పార్వతి దేవిని ప్రార్ధించెను. అంతటా దయామయియగు పార్వతీదేవి ప్రత్యక్షమై, మీకేమి కావలెను ? అని అడుగగా, అతడు తన కుమార్తెకు వైధవ్యము ప్రాప్తించకుండు అట్లు చేయమని ప్రార్ధించెను. అప్పుడు పార్వతీదేవి, ఓయి బ్రాహ్మణోత్తమా ! నీ కుమార్తె పూర్వ జన్మమున కుంకుమ గౌరీ నోము నోచి ఉల్లంగించుటచే ఈ జన్మలో బాల వైధవ్యం ప్రాప్తించుచున్నది. ఇప్పుడు ఆమె చేత ఆ నోము చేయించునచో ఆ కష్టము సంభవింపదని చెప్పగా , అమ్మకు భక్తితో నమస్కరించి కూతురితో ఆ నోము చేయించి తరువాత ఆమెకు వివాహం చేసెను. ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతియై సుఖముగా ఉన్నది. ఈ నోము ఒక సంవత్సరం పాటు కార్తీకం లేదా మాఘమాసంలో మొదలుపెట్టి రోజు ఉదయం దీపారాధన చేయగానే , అక్షింతలు చేత పట్టుకొని ఈ కథ చదువుకొని , కథ చదువుకోవడం పూర్తి కాగానే కొన్ని అక్షింతలను గౌరీ దేవి పటమునకు వేసి, కొన్ని అక్షింతలు వ్రతం చేసుకునే వారి తలపై వేసుకోవలెను. ఇలా సంవత్సరం...
జ్ఞాన సంపన్నులు జీవితము అశాశ్వతమైనదని , గుర్తించిన మోహావేశాలకు , ఆకర్షితులయ్యేవారు సామాన్యులు . వీరు ఎల్లప్పుడూ కోరుకునేవి శారీరక సుఖసౌఖ్యాలు , పంచభక్ష పరమాన్నాలు , డాంభికాని ప్రదర్శించేందుకు సిరిసంపదలు. ఈ లోకంలో తమ జీవితకాలము కొద్దిరోజులే అని గ్రహించి సర్వాంతర్యామి కరుణాకటాక్షాలు కోసం పరితపించేవారు జ్ఞాన సంపన్నులు
ఈర్షా ద్వేషాలు పుట్టిననాడు ఏమి తీసుకురాలేదు పోయేటప్పుడు ఏది వెంటరాదు మధ్యలో ఈ నాలుగురోజుల జీవితానికి మనుషులు ఒకరిమీద ఒకరికి పగలు ప్రతీకారాలు ఈర్షా ద్వేషాలు ఎందుకు ? అంత ఒకటే అనుకున్ననాడు అంతకుమించిన ఆనందం అంతకుమించిన సంతోషం మరొకటి ఉండదు.
జంధ్యాల పూర్ణిమ, దీనినే శ్రావణ పూర్ణిమ అని కూడా అంటారు. శ్రావణ పూర్ణిమ నాడు యజ్ఞోపవీతం ధారణ చేస్తారు. యజ్ఞోపవీతం లోని గ్రంధిని బ్రహ్మ ముడి అంటారు. ఈ ముడి చివరన, గాయత్రీ ఉంటుంది. జంధ్యము, బ్రహ్మ తేజస్సు, వర్చస్సు, ఆయుష్షు, యశస్సు అనుగ్రహిస్తుంది. శ్రావణ పూర్ణిమ రోజున అశౌచ సందర్భాలలో నూతన యజ్ఞోపవీతం ధరించాలి. జీర్ణమైన యజ్ఞోపవీతాన్ని ఎక్కువ కాలం ధరించరాదు. కొత్త జంధ్యం వేసుకున్న తరువాత పాత జంద్యముతో కలిసి పట్టుకొని గాయత్రీ మంత్రాన్ని జపించాలి. తత్ద్వారా నూతన యజ్ఞోపవీతం శక్తి వంతం అవుతుంది. ఆ తరువాత పాత యజ్ఞోపవీతం ఎవరు తొక్కని చోట కానీ, పారేనీటిలో కానీ వేయాలి. శ్రావణ పూర్ణిమ నాడు జంధ్యం మార్చుకొని, యధా శక్తి గాయత్రీ మంత్రం జపించాలి.
దంపతి తాంబూల నోము కథ . ఒక రాజు భార్య దంపతుల తాంబూలము నోము పట్టి నియమం తప్పింది. అందువలన ఆ భార్య భర్తలు దూరం అయ్యారు , సంపదలు తగ్గాయి . అందువలన ఆమె అరణ్యమునకు వెళ్లి అచట పార్వతి పరమేశ్వరుల గూర్చి తపస్సు చేయగా , పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి , నీవు దంపతుల తాంబూల నోము పట్టి నియమం తప్పినావు , అందువలన నీకు ఈ బాధ కలిగింది. కావున నీవు ఇంటికి వెళ్లి నియమం తప్పకుండ ఈ వ్రతం చేసుకొని ఉద్యాపన చేసుకొనిన ఎడల నీ పూర్వపు భాగ్యాలు నీకు కలుగుతాయి. నీ భర్త నీకు దగ్గర అవుతాడు అని చెప్పారు. అప్పుడు రాజు భార్య ఇంటికి వచ్చి, భక్తి శ్రద్దలతో నోము చేసుకొని ఉద్యాపన చేసినది. అప్పుడు ఆమె భర్త తిరిగి వచ్చాడు. పూర్వపు భాగ్యాలు తిరిగి వచ్చాయి. భార్య భర్తలు ఆనందంగా ఉన్నారు ఉద్యాపన : ఒక సంవత్సరము పాటు , రోజు ఉదయం మన పూజ గదిలో దీపం పెట్టగానే అక్షింతలు చేతపట్టుకొని. పైన రాసిన కథ చదువుకొని, తరువాత అక్షింతలను కొన్ని పార్వతి పరమేశ్వరుల పటమును వేసి, కొన్ని అక్షింతలు వ్రతం చేసుకొనే స్త్రీ తలపై చల్లుకొనాలి. ఇలా సంవత్సరం తరువాత బ్రాహ్మణా దంపతులకు భోజనం పెట్టి, 360 తమలపాకులు, 360 పోకచ...
లక్ష్మికళ ఆధునిక అవసరాలకు తగినట్లుగా , అటు తండ్రికో ఇటు భర్తకో ఆర్ధిక సహకారాన్ని అందించగలిగిన ప్రతిమహిళా మహాలక్ష్మి స్వరూపమే . సంపాదించకపోయిన ఉనంతలో పొదుపుగా ఇల్లు దిద్దుకుంటే చాలు ఇక ఆ ఇల్లు లక్ష్మీకళ తో శోభిల్లుతుంది ఉనంతలో తృప్తిగా ఉంటే నిజంగా ఆ ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది.
సుఖ దుఃఖాలు సముద్ర ప్రవాహానికి ఆటు పోటులు ఎలా సహజమో, అదే విధంగా మానవ జీవితం లో సుఖ - దుఃఖాలు, మంచి - చెడ్డలు, ఉత్సాహ - నిరుత్సహాలు సహజము. ఆనందం - విచారం వంటి మనోవికాసాలకి లొంగిపోతే అవి మనల్ని కృంగతీస్తాయి.
చంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకటి ఏదిరా కళ్ళు మూసి తెరిచే లోపల కలిమిలేములు మారురా మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా నాది నీది యనుచు నరుడా వాదులాడబోకురా బంక మట్టి ఇల్లురా ఇది భగ్గి భుగ్గి అవునురా ఆలుపిల్లలు ఆస్తి పాస్తులు అంతం ఏమవునురా తత్వ మర్మము తెలియలేకను తప్పుదారిన బోకురా ఆత్మకెప్పుడు చావులేకను అంతటా వెలుగొందురా మట్టి మట్టి కలిసినాక ఎట్టిభేదాలుండురా --------- సేకరణ : పూర్ణోదయం
Comments
Post a Comment